వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయపాటిపై మంత్రుల మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rayapati Sambashiva Rao
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో మధుకోడాలున్నారంటూ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీలో కలకలం సృష్టిస్తోంది. అవినీతి మంత్రులను ముఖ్యమంత్రి రోశయ్య తొలగించాలని రాయపాటి డిమాండ్ చేశారు. రాయపాటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా మంత్రులు ఉలిక్కిపడ్డారు. రాయపాటిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాయపాటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని ఐటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాయపాటిపై కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

మంత్రివర్గంలో అవినీతి పరులు ఎవరూ లేరని మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్ అన్నారు. రాయపాటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేస్తాయని ఆయన అన్నారు. అటువంటి ఆరోపణలు చేసే ముందు రాయపాటి చెక్ చేసుకోవాల్సిందని ఆయన అన్నారు. రాయపాటి ఏ ఆధారాలతో ఆరోపణలు చేశారని మరో మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు. ఆధారాలు ఉంటే అదిష్టానం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. రాయపాటి విచక్షణకే వదిలేస్తున్నానని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X