వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీలిచిత్రాల సైట్ లపై ఆంక్షలు పెట్టాలి: సిజె

By Santaram
|
Google Oneindia TeluguNews

Balakrishnan
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ లో నీలి చిత్రాలను, రెచ్చగొట్టే రాతలను పోస్ట్‌ చేసే వెబ్‌ సైట్లపై ఆంక్షలు విధించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌ ప్రభుత్వానికి సూచించారు. సినిమా తారలు సహా ప్రముఖుల ఫొటోలకు మార్పులు (మార్ఫింగ్‌) చేసి నీలిచిత్రాల్లో ఉపయోగిస్తున్నారని చెప్పారు. జాతీయ ప్రాజెక్టు కమిటీ, సైబర్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునళ్ల ఆధ్వర్యంలో 'సైబర్‌ చట్టాల అమలు'పై శనివారం జరిగిన సదస్సులో ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించారు. విదేశాల్లో ఉండే సర్వర్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సైబర్‌ నేరగాళ్ల ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులకు ఇబ్బందులెదురవుతున్నాయని జస్టిస్‌ బాలకృష్ణన్‌ చెప్పారు.

సాక్షాత్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే సైబర్‌ నేరబాధితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌ ఈ మెయిల్‌ ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్‌ చేశారు. ఆటోమొబైల్‌ విడిపరికరాల వ్యాపారాన్ని ప్రారంభించినట్లుగా ఆయన ఈ మెయిల్‌ ఖాతాలోంచి మెయిళ్లు పంపించారు. జస్టిస్‌ లోకుర్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X