రాజ్యసభకు అల్లు అరవింద్ పోటీ?

Allu Aravind
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఒక్క రాజ్యసభ సీటును సాధించుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసుతో అవగాహనకు రానున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఒక సీటు కోసం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసుతో బేరసారాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు మార్లు చిరంజీవి ఆ విషయంపై ముఖ్యమంత్రి కె.రోశయ్యతో, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో భేటీ అయినట్లు చెబుతున్నారు.

ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసేందుకు పార్టీ మరో నాయకుడు సి. రామచంద్రయ్య సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాలం ఉండగానే సి. రామచంద్రయ్య రాజ్యసభ సీటుకు రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇందుకు గాను ఆయనను రాజ్యసభకు పంపాలనే యోచనలో చిరంజీవి ఉన్నట్లు చెబతున్నారు. తాము కాంగ్రెసుతో గానీ తెలుగుదేశం పార్టీతో గానీ లేమని, త్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తాంమని చిరంజీవి సోమవారం విశాఖపట్నంలో చెప్పారు.

ప్రజారాజ్యం పార్టీకి ప్రస్తుతం 18 మంది సభ్యులున్నారు. ప్రజారాజ్యం ఒక్క రాజ్యసభ సీటును గెలవాలంటే ఆ పార్టీకి మరో 23 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అయినా ఫలితం సభిస్తుందనేది వట్టి మాటగానే మిగిలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+