హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు విజయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్‌: హైదరాబాదులోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక సీటును కాంగ్రెసు, రెండో సీటును దాని మిత్ర పక్షం మజ్లీస్ కైవసం చేసుకున్నాయి. హైదరాబాదు నుంచి రెండు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం పూర్తయింది. కాంగ్రెసుకు చెందిన ఎంఎస్ ప్రభాకరరావు, మజ్లీస్ కు చెందిన సయ్యద్ అమీన్ హసన్ జాఫ్రీ శాసన మండలికి ఎన్నికయ్యారు. మొత్తం 69 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెసు, మజ్లీసులకు 55 ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఒక ఓటు మాత్రమే పోలయింది. రెండు ఓట్లు చెల్లలేదు.

సోమవారం ఉదయం ఎనిమిది గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా, రంగారెడ్డి జిల్లా నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. జిల్లా నుంచి ఒక స్థానానికి జరిగిన ఎన్నికల బరిలో కాంగ్రెసు నుంచి కాసాని జ్ఞానేశ్వర్, తెలుగుదేశం పార్టీ నుంచి ఎం. నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X