వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చత్తిస్ గఢ్ లో మళ్ళీ రెచ్చిపోయిన మావోలు
గత నెలలో చత్తిస్ ఆరు చోట్ల నక్సలైట్లు మెరుపు దాడులకు దిగారు. ఓ సిఆర్పీఎఫ్ వాహనాన్ని మందుపాతరతో మావోయిస్టులు పేల్చేశారు. ఈ ఘటనలో 73 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఓ ఆపరేషన్ ముగించుకుని వస్తున్న వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. దంతెవాడ జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. యాంటీ మైన్ వెహికిల్ ను నక్సలైట్లు పేల్చేశారు. దాదాపు 500 మంది జవాన్లు వెనక్కి వస్తుండగా పథకం ప్రకారం మావోయిస్టులు దాడులు చేశారు. సంఘటనా స్థలం నుంచి 73 మృతదేహాలను తరలించారు.
Comments
Story first published: Wednesday, May 12, 2010, 10:31 [IST]