వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీ దిగి వస్తుంది: చిరంజీవి
జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం తక్షణం శ్వేతపత్రం విడుదల చెయ్యాలని చిరంజీవి డిమాండ్ చేశారు. తాజాగా 'కాగ్' నివేదికలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో నిధుల వృధా, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ...దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చెయ్యాలన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాంతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న తెరాస నేతలు, మొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే తనను విమర్శించడం అర్థరహితమన్నారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారపక్షంగా పదవులు అనుభవించిన ఆ పార్టీ తెలంగాణ కోసం, తెలంగాణ సోదరుల కోసం ఏం చేసింది? అని ప్రశ్నించారు.
Comments
Story first published: Wednesday, May 12, 2010, 8:46 [IST]