హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహారాష్ట్ర వైపు నిందితుల పరారీ

By Staff
|
Google Oneindia TeluguNews

Charminar
హైదరాబాద్: హైదరాబాదులోని శాలిబండ కాల్పుల నిందితులు మహారాష్ట్ర వైపు పారిపోయినట్లు తెలుస్తోంది. ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలో మెదక్ జిల్లాలోని తూప్రాన్ చెక్ పోస్టు వద్ద హల్ చల్ సృష్టించారు. ఆపడానికి ప్రయత్నించిన చెక్ పోస్టు సిబ్బంది వారు తుపాకులతో బెదిరించి పారిపోయినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. కాగా, హైదరాబాదులో పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇదిలా ఉంటే, హైదరాబాదులోని శాలిబండలో పోలీసులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్ కు) బదిలీ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. దీంతో సిట్ విచారణ నిమిత్తం రంగంలోకి దిగింది. శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు పోలీసులపైకి జరిపిన కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రమేష్ మృతదేహాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చేర్చారు. అతని స్వగ్రామం గుట్టకిందపల్లెలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X