హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిట్ కు శాలిబండ ఫైరింగ్ కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Charminar
హైదరాబాద్: హైదరాబాదులోని శాలిబండలో పోలీసులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్ కు) బదిలీ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. దీంతో సిట్ విచారణ నిమిత్తం రంగంలోకి దిగింది. శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు పోలీసులపైకి జరిపిన కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రమేష్ మృతదేహాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చేర్చారు. అతని స్వగ్రామం గుట్టకిందపల్లెలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి.

కాగా, శాలిబండ కాల్పుల కేసులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించిట్లు తెలుస్తోంది. పక్కా పథకం ప్రకారమే ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. ముందు రెక్కీ కూడా నిర్వహించినట్లు పోలీసులు పసిగట్టారు. మధ్నాహ్నం నుంచి ఉగ్రవాదులు అక్కడి హోటల్లో మకాం వేసినట్లు గుర్తించారని అంటున్నారు. ఇదిలా వుంటే, సంఘటనా స్థలంలో టిజిఐకి చెందిన ఫసియుద్దీన్ పేర పోలీసులకు ఓ లేఖ దొరికింది. ఈ కాల్పులకు పాల్పడింది తామేనని అతను ఆ లేఖలో రాశాడు. గతంలో మక్కా మసీదులో కాల్పులకు బాధ్యులైన పోలీసులను శిక్షించే వరకు దాడులు చేస్తూనే ఉంటామని అతను చెప్పాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X