అగ్గిపెడ్తాం, బుగ్గి చేస్తాం: కెసిఆర్

మన చేతిలో కత్తి పట్టుకొని ఇతరులను యుద్ధం చేయమనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు తమ చేతిలో ఉన్న ఓటు అనే కత్తిని ఇతరులకు ఇచ్చి సమస్యలు పరిష్కరించమంటూ చిప్పపట్టుకొని అడుక్కోవడం బాగోలేదన్నారు. మన ఓట్లు మనమే వేసుకుని, మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని అన్నారు. ఆంధ్రా పెత్తనం ఉన్న పార్టీలు వద్దని, తెలంగాణలో వంద అసెంబ్లీ, మొత్తం పార్లమెంటు స్థానాలను గెలిపించుకుంటే కేంద్రం దిగి వస్తుందని చెప్పారు.
డిసెంబరు తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో అన్ని పార్టీల రంగు, దుర్నీతి, సంస్కారం తేలిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని, అయితే దాన్ని రాజీనామాలతో అడ్డుకున్నారని అన్నారు. దేశంలోని అత్యంత దయనీయమైన, దగాపడ్డ జిల్లాల్లో పాలమూరు ఒకటని, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల అత్యధికంగా నష్టపోయింది ఈ జిల్లానే అని కేసీఆర్ చెప్పారు. ప్రణాళిక సంఘం కూడా దేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో పాలమూరు ఒకటని చెప్పిందన్నారు. జిల్లాకు 54 టీఎంసీల నీటిని కేటాయిస్తే 10 టీఎంసీలే వినియోగించుకోగలుగుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications