ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రకాశంలో రేపు చిరు బస్సు యాత్ర

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ఒంగోలు: పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి చేపట్టిన బస్సు యాత్ర రేపు జిల్లాకు చేరనుంది. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికలకు ముందు జిల్లాలో పర్యటించినప్పుడు అన్నిచోట్లా ఆదరణ లభించినా చీరాల, పర్చూరులలో మాత్రం అధికంగా ఉంది. యాదృచ్ఛికంగా తాజా ఉద్యమం వల్ల కూడా ఈ ప్రాంత వాసులకే అధిక ప్రయోజనమిస్తోంది. ఈ కారణంగానే ఆయన ఇక్కడ బస్సు యాత్రకు ప్రాధాన్యమిచ్చారని పీఆర్పీ నాయకులు చెప్తున్నారు.

సోమవారం రాత్రి 12 గంటలకు బాపట్ల నుంచి చీరాల ఐటీసీ అతిథి గృహానికి చిరంజీవి చేరుకుంటారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ముంతావారి సెంటర్‌లోని సాయికల్యాణ మండపంలో విలేకరులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశం.

సాయంత్రం 4 గంటలకు గడియార స్తంభం సెంటర్‌ నుంచి బస్సు యాత్ర ప్రారంభం. జాండ్రపేట, వేటపాలెం, పందిళ్లపల్లి, కడవకుదురు, చినగంజాం, ఉప్పుగుండూరు, రాచపూడి అడ్డరోడ్డు, దుద్దుకూరు, కొణికి, ఇంకొల్లు, దగ్గుబాడు, పూసపాడు అడ్డరోడ్డు, వంకాయలపాడు, నూతలపాడుల మీదుగా రాత్రి 10గంటలకు పర్చూరు చేరుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X