వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయం చేయడం లేదు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: రైతు సమస్యలపై తాను రాజకీయం చేయడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతు సమస్యలను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు, వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కు విన్నవించడానికి ఆయన సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. రైతుల పంటలకు మద్దతు ధర ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వంపై తాను ఒత్తిడి తెస్తానని ఆయన అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.

రైతుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు. రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తేవడానికి తాను ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను ఆయన కలుసుకున్నారు. రైతుల సమస్యలపై ఆయన పవార్ కు వివరించారు. సాయంత్రం నాలుగు గంటలకు వాణిజ్య శాఖ మంత్రి ఆనంద శర్మతో భేటీ అవుతారు. పొగాకు బోర్డుకు చైర్మన్ ను నియమించాలని ఆయన ఆనంద శర్మను కోరుతారు. రాత్రి ఏడు గంటలకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో సమావేశమవుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X