జగన్ ది ఆధిపత్య యాత్ర: కోదండరామ్

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి యాత్రలకు అనుమతి ఇవ్వరాదని కోరారు. జగన్ వరంగల్లో యాత్ర నిర్వహిస్తే తీవ్రపరిణామాలు సంభవించే అవకాశం ఉందన్నారు. అన్నిరకాల పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం, జగనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం తెలంగాణ హక్కుల కోసం జరిగే యాత్రలకు అనుమతులు ఇవ్వడంలేదని, అదే తెలంగాణలో సీమాంధ్ర సంపన్నవర్గాలు చేస్తున్న ఆధిపత్య యాత్రలకు మాత్రం అనుమతులు ఇస్తోందన్నారు. ఇది వివక్ష కాదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ వరంగల్లో యాత్ర తలపెట్టడంతో ఉద్వేగానికిలోనై, పర్యటనకు నిరసనగా రాజ్కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారని, యాత్రనే ఆయనను ఆత్మహత్యకు పురికొల్పినందున అందుకు జగనే కారకుడని, ఆయనపై పోలీసు కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమం కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరులను ఆదుకుంటామని ఐకాస అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్గౌడ్ చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూవరంగల్ జిల్లాలో 40 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామన్నారు.












Click it and Unblock the Notifications