అయేషా కేసు: సత్యంబాబు పరారీ
హైదరాబాదు నుంచి విజయవాడకు తీసుకుని వెళ్తుండగా సత్యంబాబు పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, సత్యంబాబు పరారీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్యంబాబు పరారీ కట్టుకథ అని అతని తల్లి మరియమ్మ అంటోంది. సత్యంబాబు నరాల వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. దానివల్ల అతను పారిపోయాడంటే నమ్మకం కుదరడం లేదని అంటున్నారు. నరాల వ్యాధికి హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతనికి హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చికిత్స చేయిస్తున్నారు. నిమ్స్ నుంచి విజయవాడ తీసుకెళ్తుండగా సత్యంబాబు పారిపోయాడని అంటున్నారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లనే సత్యంబాబు పారిపోయాడని విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు అంటున్నారు. ఇందుకు బాధ్యులైన పది మంది పోలీసులను ఆయన సస్పెండ్ చేశారు.
Comments
Story first published: Saturday, May 22, 2010, 12:49 [IST]