జగన్ తీరుపై సోనియా సీరిసయస్

సాక్షి వార్తాకథనాలపై, జగన్ ప్రసంగాలపై రోశయ్య వివరంగా సోనియాకు వివరించే అవకాశం ఉంది. సాక్షి వార్తాకథనాల ఆంగ్ల అనువాదాలను కూడా ఆయన సోనియాకు అందించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ వర్గానికి చెందినవారిని ముందస్తుగా పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హెచ్చరించారు. సోనియానే ప్రశ్నిస్తారా అంటూ నిలదీశారు. అటువంటివారిపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. తాను సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని ప్రకటనలు చేస్తున్నప్పటికీ జగన్ విమర్సలు చేస్తున్నారు. జగన్ వర్గానికి ఆదిలోనే కళ్లెం వేయకపోతే నష్టం వాటిల్లుతుందని రోశయ్య సోనియాకు చెప్పనున్నట్లు సమాచారం.
తాను స్వేచ్ఛగా పని చేయడానికి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కూడా రోశయ్య సోనియాను కోరే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా అనుమతి ఇవ్వాలని ఆయన కోరే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు రోశయ్య, డిఎస్ ఢిల్లీలోనే ఉంటున్నారు. జగన్ వర్గానికి ఏదో విధంగా కళ్లెం వేయకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని వారు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications