జగన్ వర్గీయులపై యాష్కీ ధ్వజం

Madhu Yashki
న్యూఢిల్లీ/హైదరాబాద్: అవసరమైతే తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఎదరిస్తామని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ధ్వజమెత్తారు. సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలు క్రమశిక్షణా రాహిత్యమేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దీనిపై పార్టీ అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు. మహాత్మా గాంధీ తర్వాత అంతటి త్యాగజీవి సోనియా గాంధీ అని ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సమీక్షించడమంటే వాటిని రద్దు చేయడం కాదని ఆయన స్పష్టం చేశారు. పథకాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోందని ఆయన అన్నారు.

కాగా, జగన్ వర్గీయులపై కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు సోమవారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. సోనియా గాంధీపై వ్యాఖ్యలు చేసిన వారికి సర్జికల్ చికిత్స ఇవ్వాలని ఆయన అన్నారు. వారికి మెడికల్ ట్రీట్ మెంటు సరిపోదని, సర్జికల్ ట్రీట్ మెంటే సరైందని ఆయన అన్నారు. వారిని ఏకంగా పార్టీ నుంచి తప్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎబిసిడిలు తెలియనివారు సోనియాపై విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+