వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాతో రోశయ్య సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రమంత్రివర్గ విస్తరణ, సంక్షేమ పథకాల తీరు, రాజ్యసభ ఎన్నికలు, పార్టీలో కొందరి ధిక్కారస్వరం తదితర అంశాలపై ఆయన సోనియాగాంధీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇన్‌ ఛార్జి వీరప్పమొయిలీ కూడా పాల్గొన్నారు.

లైలా తుఫాను నష్టంపై ముఖ్యమంత్రి రోశయ్య సోనియాకు నివేదిక సమర్పించారు. సోనియా గాంధీతో భేటీకి ముందు ఆయన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత కూడా వీరప్ప మొయిలీ, డి. శ్రీనివాస్ కు మంధ్య చర్చలు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X