వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ యాత్రపై సోనియాకు ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: వరంగల్ జిల్లాలో తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రను వాయిదా వేయించేందుకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. జగన్ యాత్రను వాయిదా వేయించాలని కోరుతూ 11 మంది తెలంగాణ ఎంపిలు తమ సంతకాలతో సోనియాకు ఓ లేఖను అందజేశారు. జగన్ ఓదార్పు యాత్ర వల్ల తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. జగన్ యాత్ర వల్ల తెలంగాణ శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చునని వారంటున్నారు.

సోనియాకు లేఖను అందజేయడంతో ఆగకుండా ఐదుగురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మంద జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎస్ రాజయ్య, బలరాం నాయక్, వివేక్ మంగళవారం సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ను కలిసి జగన్ ఓదార్పు యాత్రను వాయిదా వేయించాలని కోరారు. వారు గంటకు పైగా అహ్మద్ పటేల్ తో మాట్లాడారు. విషయాలను రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీకి చెప్పాలని ఆయన వారికి సూచించారు. దీంతో వారు వీరప్ప మొయిలీని కలిసి అదే విజ్ఞప్తి చేశారు. తాము చెప్పిన విషయాల పట్ల మొయిలీ సానుకూలంగా ప్రతిస్పందించారని వారు మీడియాతో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X