సండే వరకు మండే ఎండలు!
రాజస్థాన్ ఎడారుల నుంచి విదర్భ మీదుగా వీస్తున్న వేడిగాలులతో మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 5-6 డిగ్రీలు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలు నిప్పుల కొలిమే అయ్యాయి. ఉపరితల బొగ్గు గనులున్న కరీంనగర్ జిల్లా రామగుండంలో అత్యధికంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పక్కనేఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ ఉష్ణోగ్రత 47 డిగ్రీలకు చేరింది. రాజధాని హైదరాబాద్లో 44 డిగ్రీలు నమోదైంది. వడదెబ్బకు తెలంగాణ జిల్లాల్లో 16 మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు మరణించారు.
సకాలంలో వర్షాలు పడతాయన్న వార్తలు రైతులలో ఉత్సాహం నింపుతున్నాయి. నారుమళ్ళ కోసం వారు విత్తనాలని సిద్ధం చేసుకుంటున్నారు. జూన్ 1న రుతువవనాలు కేరళను తాకనున్నాయి. జూన్ 5 కల్లా రాష్ట్ర మంతటా విస్తరించనున్నాయి.
Comments
Story first published: Wednesday, May 26, 2010, 10:39 [IST]