హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై జగన్ రాజకీయ కుట్ర: దామోదర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రను తెలంగాణపై కుట్రగా కాంగ్రెసు సీనియర్ శాననసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి అభివర్ణించారు. జగన్ యాత్ర పేరుతో తెలంగాణలో చిచ్చు పెట్టారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. తమ కాంగ్రెసు శాసనసభ్యులం, పార్లమెంటు సభ్యులు ఇది సమయం కాదని చెప్పినా వినకుండా జగన్ తెలంగాణలో ఓదార్పు యాత్రకు దిగారని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం చెప్పినా వినలేదని ఆయన అన్నారు. జగన్ యాత్ర ప్రారంభం కాక ముందే కాల్పుల్లో ముగ్గురు మరణించారని, ఈ పరిణామాలకు జగన్ మొండి వైఖరే కారణమని ఆయన అన్నారు.

ఆమరణ నిరాహార దీక్ష తలపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును అరెస్టు చేసినట్లుగా జగన్ ను అరెస్టు చేస్తారని అనుకున్నామని, కానీ జగన్ కు కొంత అవకాశం ఇచ్చారని, ఆ అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకోలేకపోయారని ఆయన అన్నారు. తాను తెలంగాణకు రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని జగన్ చెప్తే పరిస్థితి వేరుగా ఉండేదని ఆయన అన్నారు. జగన్ అరెస్టు సమంజసమైందేనని, శాంతిభద్రతలకు విఘాతం కలిగే సమయంలో అరెస్టు చేయడం అవసరమని ఆయన అన్నారు.

జగన్ పార్టీ అధిష్టానం మాట వినాల్సి ఉందని, శ్రీకృష్ణ కమిటీని వేసిన తర్వాత అధిష్టానం చేసిన సూచనను తాము పాటించామని, అధిష్టానం సూచన మేరకే తాము తెలంగాణ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపామని, ఈ స్థితిలో జగన్ యాత్ర మంచిది కాదని అధిష్టానం చేసిన సూచనను జగన్ పాటించకుండా మొండిగా వ్యవహరించారని ఆయన అన్నారు. కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ, ఎమ్మెల్సీ మురళి తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని జగన్ చేత చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X