కాంగ్రెసు కార్యకర్తగా యాత్ర చేపట్టలేదు: జగన్

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కార్యకర్తగా తాను ఓదార్పు యాత్రను చేపట్టలేదని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ స్పష్టం చేశారు. తన తండ్రి చనిపోయినప్పుడే తాను ఓదార్పు కార్యక్రమాన్ని ప్రకటించానని, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఖమ్మం జిల్లాలో తాను రాజకీయ ప్రకటన చేయలేదని, అలాగే వరంగల్ జిల్లాలో కూడా చేయదలుచుకున్నానని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎందుకు ఇలా ప్రవర్తించిందో అర్థం కావడం లేదని, ప్రభుత్వం కూడా అత్యుత్సాహం ప్రదర్సించిందని ఆయన అన్నారు. ఓదార్పు యాత్ర జగన్ వ్యక్తిగా చేస్తున్న యాత్ర అని, కాంగ్రెసు పార్టీకి దీనితో సంబంధం లేదని ఆయన అన్నారు.

తన ఓదార్పు యాత్ర కచ్చితంగా కొనసాగుతుందని, అది తన బాధ్యత అని, చనిపోయినవారు తన కుటుంబ సభ్యులని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించకపోతే తన తండ్రి పట్ల తగిన బాధ్యత నిర్వర్తించినట్లు కాదని ఆయన అన్నారు. ప్రాంతాలకు అతీతంగా తన ఓదార్పు యాత్ర సాగుతుందని ఆయన అన్నారు. తన అరెస్టు తర్వాత జరిగిన విధ్వంసకాండ పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతాలకు అతీతంగా అభిమానులు సంయమనం పాటించాలని, విధ్వంసానికి దిగవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల కోసం ప్రజలను బలిపెట్టవద్దని, తన యాత్రను రాజకీయం చేయవద్దని తాను తెరాసకు విజ్ఞప్తి చేస్తానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+