వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపిని డబ్బు వసూళ్లకు వాడుకుంటున్నారు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu
హైదరాబాద్: రాష్ట్ర శాంత్రి భద్రతల కమిటీ చైర్మన్ కెవిపి రామంచదర్ రావును ముఖ్యమంత్రి కె. రోశయ్య డబ్బు వసూళ్లకు వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మహానాడు శనివారం ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై మాట్లాడారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య స్వార్థం కోసం కెవిపిని డబ్బుల కోసం వాడుకుంటున్నారని ఆయన అన్నారు. రోశయ్య ప్రభుత్వం వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రోశయ్య అసమర్థతను ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో మైనింగ్, ల్యాండ్ మాఫియాలు పెరిగాయని ఆయన అన్నారు. ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ పట్టించుకోని కేవీపీని శాంతిభద్రతల కమిటీ పదవినుంచి వెంటనే తప్పించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. పోలీసు అధికారుల్ని స్వార్థానికి వాడుకుంటున్న అధికారపక్షం వైఖరిని ఆయన తప్పుబట్టారు. తెలుగుదేశం కార్యకర్తలపై అధికారపక్షం చేస్తున్న దాడులను ఆయన ఖండించారు. దాడులను తాము అడ్డుకుంటామని ఆయన అన్నారు. తాము రెచ్చిపోతే కాంగ్రెసువాళ్లు మిగలరని ఆయన అన్నారు. శాంతిభద్రతల సమస్యను శాంతిభద్రతల సమస్యగానే చూడాలని, రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, కానీ కాంగ్రెసు ప్రభుత్వం అలా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X