వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ జాగ్రత్తగా ఉండాల్సింది: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: ఓదార్పు యాత్ర సందర్భంగా కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ జాగ్రత్తగా ఉండాల్సిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కోసం శనివారం ఢిల్లీ వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయబోమని ఆయన మరోసారి చెప్పారు. సోనియాతో చర్చలకు తాను ఓపెన్ మైండ్ తో వచ్చినట్లు ఆయన తెలిపారు.

రాజ్యసభ ఎన్నికల గురించి సోనియాతో మాట్లాడుతానని ఆయన అన్నారు. భావసారూప్య పార్టీలతో పొత్తులకు సిద్ధమని తాము చెప్పామని, అందుకు అనుగుణంగా కాంగ్రెసుతో పొత్తులకు సిద్ధపడుతున్నామని ఆయన చెప్పారు. పొత్తుల విషయంలో పరస్పర ప్రయోజనాలు చూసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ తమకు ఏం ఆఫర్ చేస్తుందో చూసిన తర్వాత మాట్లాడుతానని ఆయన అన్నారు. చిరంజీవితో పాటు సోనియా కోసం ప్రజారాజ్యం పార్టీ నాయకులు కోటగిరి విద్యాధర రావు, సి. రామచంద్రయ్య, వేదవ్యాస్ వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X