ఓదార్పు యాత్రపై వైయస్ జగన్ ది మూర్ఖత్వం: కె చంద్రశేఖర రావు

వైయస్ జగన్ ది ఓదార్పు యాత్రనా, దండయాత్రనా అని ఆయన ప్రశ్నించారు. ఇనుప రాడ్లకు కాంగ్రెసు జెండాలు పెట్టుకున్నారని, బేస్ బాల్ బ్యాట్లతో వచ్చారని, పిస్టల్స్, బుల్లెట్లతో వచ్చారని, ఓదార్పు యాత్రకు ఇవన్నీ ఎందుకని ఆయన అన్నారు. కొండా మురళి, కొండా సురేఖల వల్లనే హింసాకాండ చెలరేగిందని ఆయన ఆరోపించారు. వారిని అరెస్టు చేయకుండా వారికి రాచ మర్యాదలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ నాయకులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, తెలంగాణ జెఎసి నేత కోదంరామ్ తదితర తెలంగాణవాదులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. వారిపై కేసులు ఎత్తేసి ప్రభుత్వం, డిజిపి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబాబాద్ సంఘటనపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా విచారించకపోవడం మరోసారి తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు.
మహబూబాబాద్ లో మొత్తం 21 మంది గాయపడ్డారని ఆయన చెప్పారు. కొండా మురళి జరిపిన కాల్పుల వల్లనే చాలా మంది గాయపడ్డారని, దానిపై విచారణ జరిపించడం అవసరమని, లైసెన్స్ లేని గన్ లతో కాల్పులు జరిపారని ఆయన అన్నారు. మీడియాపై కూడా దాడి చేశారని ఆయన ఆరోపించారు. మాజీ మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించే నీతిని జగన్ అవలంబిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సాయుధ ముఠాలు మహబూబాబాద్ లోకి ప్రవేశించాయని ఆయన ఆరోపించారు. కొండా దంపతులు రెచ్చగొట్టడం వల్లనే ప్రశాంతత దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. కొండా మురళి మహబూబాబాద్ వచ్చే వరకు ప్రశాంతంగానే ఉందని, తెలంగాణవాదులు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని, మురళి తెలంగాణవాదులను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications