వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగొచ్చిన హైకమాండ్: వైయస్ జగన్ ఓదార్పుకు గ్రీన్ సిగ్నల్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రపై పార్టీ అధిష్టానం దిగివచ్చింది. ఆయన ఓదార్పు యాత్రకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ మంగళవారం ఉదయం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిశారు. ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్ర యథాతథంగా ఉంటుందని మొయిలీతో భేటీ అనంతరం జగన్ మీడియాతో చెప్పారు. శాసనసభకు జరిగే ఉప ఎన్నికల తర్వాత తాను తెలంగాణలో ఓదార్పు యాత్రను చేపడతానని ఆయన అన్నారు.

మహబూబాబాద్ ఘటనపై జగన్ మొయిలీకి వివరణ ఇచ్చారు. ఓదార్పు యాత్రపై హైకమాండ్ కన్నెర్ర చేస్తుందనే ఊహాగానాలకు ఇంతటితో తెర పడింది. ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వంపై ఆయన మొయిలీ వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన ఓదార్పు యాత్ర రాజకీయమైంది కాదని, ఒక తండ్రి కోసం ఒక కుమారుడు చేసే పని అని జగన్ మొయిలీతో చెప్పినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X