హాయ్ ల్యాండ్ కన్నా మిన్నగా విజయవాడలో పర్యాటకం

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రవిబాబు మాట్లాడుతూ సింగ్నగర్లో వైయస్ రాజశేఖర రెడ్డి స్మృతివనం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. నగరంలో రాజీవ్పార్క్, రాఘవయ్యపార్క్, కృష్ణానదీ పరివాహక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన దుర్గమ్మ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని చెప్పారు. వారు పర్యాటక కేంద్రాలన్నీ సందర్శించే విధంగా నగరంలో హాయ్ల్యాండ్ను రూపొందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
నగరంలో డిసెంబర్, జనవరి నెలల్లో బీఆర్టీఎస్ బస్సులు నడుస్తాయని మునిసిపల్ కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బస్సుల నిర్వహణ బాధ్యతను ఆర్టీసీ సమర్థవంతంగా చేపట్టగలదన్నారు. నగరంలో బీఆర్టీఎస్ బస్సులు రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావని ఆయన అన్నారు. ఆర్టీసీ ఆర్ఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నుంచి హాయ్ల్యాండ్కు మూడు మెట్రో బస్సు సర్వీసులు ఏర్పాటుచేశామన్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ మీదుగా హాయ్ల్యాండ్కు ప్రతి అరగంటకు ఒక బస్సు నడుపుతామని చెప్పారు. ఉదయం 7.30 గంటలకు నగరంలో మొదటి బస్సు బయలుదేరుతుందని, రాత్రి 10.30 గంటలకు హాయ్ల్యాండ్ నుంచి లాస్ట్బస్ బయలుదేరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ రఘునాథ్, హాయ్ల్యాండ్ ఎండీ ఆలూరి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications