రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి
అదే విధంగా వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం గుండ్ల కర్తికి చెందిన రైతు రవి (28) దుక్కిదున్నుతూ పిడుగుబారిన పడి ప్రాణాలు వదిలాడు. ఇలా ఉండగా నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రాన్ని పలుకరించాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలుప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 24 గంటల్లోగా రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించవచ్చని వాతావరణశాఖ భావిస్తోంది. కేరళ, దక్షిణ తమిళనాడు, కర్ణాటక మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు కొన్ని చోట్ల చురుకుగా కదుతున్నాయి. కర్ణాటకలోని కన్నూరు, బెంగుళూరు మీదుగా రాయలసీమలోని కడప, దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, బాపట్ల వరకూ విస్తరించినట్లు వాతావరణశాఖ తెలిపింది
Comments
Story first published: Sunday, June 6, 2010, 9:58 [IST]