వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పును ఆపాలని కెవిపికి అధిష్టానం ఆదేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ఆపాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాజ్యసభ సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావును ఆదేశించినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ మొండి పట్టుతో ముందుకు సాగితే తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఆ విషయాన్ని కెవిపితో చెప్పినట్లు తెలుస్తోంది.

కెవిపి రామచందర్ రావు మాత్రం అధిష్టానం మాట ప్రకారం వెళ్తేనే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి ముందుకు పోవడం వల్ల నష్టం జరుగుతుందనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అదే విషయాన్ని కెవిపి జగన్ తో చెప్పినట్లు సమాచారం. జగన్ మాత్రం కెవిపి మాటలను పూర్తిగా వినడం లేదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X