హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకమాండ్ మాట విన్నట్లే విని చెలరేగనున్న జగన్?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన ఓదార్పు యాత్ర విషయంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేసే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రను కొనసాగించడానికే ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, అది ముందు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి జరగకపోవచ్చు. ఓదార్పు యాత్రను ఆపాలనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం మాటను విన్నట్లే విని తనదైన వ్యూహాన్ని అమలు చేయడానికి పూనుకున్నట్లు సమాచారం. అనంతపురంలో ఆదివారం తన సన్నిహితులతో చర్చలు జరిపి ఈ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల సానుభూతిని మరింతగా పొంది ఓదార్పు యాత్రకు బయలుదేరాలని ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు.

అధిష్టానం చెప్పినందున తాత్కాలికంగా ఓదార్పు యాత్రను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత ఇంకా ఎన్ని రోజులు ఆగాలనే వాదనతో ఆయన ముందుకు సాగుతారని అంటున్నారు. అందుకు గాను ఆయన మరో వారం, పది రోజులు తీసుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఓదార్పు యాత్ర తన వ్యక్తిగతమని, తన తండ్రికి సంబంధించిందని, ఒక కొడుకుగా తన తండ్రికి ఇచ్చే నివాళిని వద్దడనం ఎంత వరకు సమంజసమని అంటూ ఆయన తన వాదనను ప్రజల ముందు పెట్టే అవకాశం ఉంది. తద్వారా ప్రజల నుంచి తన పట్ల సానుభూతి పెరుగుతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఈసారి తాను ఒక్కడే కాకుండా తల్లి విజయలక్ష్మితో కలిసి ఓదార్పు యాత్రకు బయలుదేరుతారని అంటున్నారు. దానివల్ల యాత్రను ఆపడం ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురు కావడమే కాకుండా ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఓదార్పు యాత్రను అపి తల్లితో కలిసి పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలిసేందుకు జగన్ ప్రయత్నించవచ్చు. అప్పుడు కూడా సోనియాను కలిసి, అనుమతి పొందే అవకాశం లేకపోతే తన వ్యూహాన్ని అమలు చేయాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X