హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పై ముఖ్యమంత్రి పరోక్ష చురక

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తనపై విమర్శలు చేస్తున్న, తమ పార్టీ కాంగ్రెసు పార్టీ అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కె. రోశయ్య పరోక్షంగా చురకలు అంటించారు. జగన్ కు వ్యతిరేకంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. యువ నాయకులు తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీని చూసి చాలా నేర్చుకోవాలని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామంలో పల్లెకు పోదాం కార్యక్రమం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

కొత్త పథకాల ఆలోచన లేకుండా ఆచరణలో ఉన్న పథకాలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పల్లెల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పన దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.50కోట్ల వ్యయంతో నూతన పథకం ప్రారంభించనున్నట్లు రోశయ్య వెల్లడించారు. కేంద్ర మంత్రులు జైపాల్ ‌రెడ్డి, పనబాకలక్ష్మితో పాటు రాష్ట్రమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బొత్ససత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X