ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను సజీవ దహనం చేసిన సిఆర్పిఎఫ్ జవాను

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakasam Dist
ఒంగోలు: అనుమానం పెనుభూతమై ఓ మహిళను కాటేసింది. ప్రకాశం జిల్లా రాచవరం మండలం కౌతవరం గ్రామంలో చిన రాముడు అనే సిఆర్పిఎఫ్ జవాను తన భార్య శ్రీదేవిని సజీవదహనం చేశాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి చిన రాముడు భార్యను హత్య చేశాడు.

చినరాముడు 20 రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. అతనికి గ్రామంలో ఓ అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. దాన్ని అతను కొనసాగిస్తూ వస్తున్నాడు. భార్యకు కూడా అటువంటి వైవాహికేతర సంబంధం ఉందనే అనుమానం అతన్ని వేధించడం మొదలు పెట్టింది. దీనిపై భార్యాభర్తలకు గొడవ జరిగింది. అంతే, అతను భార్యను సజీవంగా దహనం చేశాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X