గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో ఆంధ్ర విద్యార్థి శశిశేఖర్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
గుంటూరు: అమెరికాలో మరో ఆంధ్ర విద్యార్థి అసువులు బాశాడు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన గుంటూరుజిల్లా బాపట్ల విద్యార్థి కుంటా శశిశేఖర్‌ కొలనులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. బర్లింగ్‌టన్‌లోని వెర్మాంట్‌ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చదువుతున్న శేఖర్‌ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. కర్రల వంతెనపై నుంచి కొలనులో దూకి ప్రమాదవశాత్తు మృతిచెందాడు.

శశిశేఖర్‌ మృతదేహాన్ని ఈనెల 12న బాపట్లకు పంపేలా తానా, భారత ఎన్ ‌ఆర్ ‌ఐ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. శశిశేఖర్‌ బిట్స్‌పిలానీలో ఎంటెక్‌ చదివాడు. మూడేళ్ల పీహెచ్‌డీ కోర్సు పూర్తిచేసేందుకు 2008లో అమెరికా వెళ్లాడు. శశిశేఖర్‌ తండ్రి రవీంద్రనాథ్‌ బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలో ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నారు. శశిశేఖర్ మృతితో ఆ కుటుంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X