హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు, డిఎస్ మమ్మల్ని కలుస్తారని భావిస్తున్నాం: దుగ్గల్

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తమను కలుస్తారని భావిస్తున్నామని, వారితో తాము త్వరలోనే సమావేశమవుతామని రాష్ట్ర పరిస్థితిపై అధ్యయనానికి కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ అన్నారు. తమను కలవకూడదని బిజెపి జాతీయ స్థాయిలోనే నిర్ణయం తీసుకుందని, తమను కలవాలని వారిపై ఒత్తిడి తేబోమని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

వచ్చే నెలలో క్షేత్ర స్థాయి పర్యటనలుంటాయని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్షేత్ర పర్యటనలుండవని, ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో తాము పర్యటించబోమని ఆయన చెప్పారు. తిరిగి ఈ నెల 16,17 తేదీల్లో రాష్ట్రానికి వస్తామని ఆయన చెప్పారు. ఎన్నారైలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X