హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బెదిరింపు లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి గురువారం బెదిరింపు లేఖ వచ్చింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ హైదరాబాద్ లష్కరే తోయిబా పేరుతో ఈ లేఖ కిషన్ రెడ్డికి అందింది. దీనిపై కిషన్ రెడ్డి ఆబిడ్స్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దుండగులు రాసిన లేఖ ఉర్దూ భాషలో ఉంది.

కిషన్ రెడ్డి భారత్ విడిచి వెళ్లాలని, హిందువులు హైదరాబాదు వదలి వెళ్లాలని ఆ లేఖలో బెదిరించారు. భారత్ వదిలి వెళ్లకపోతే చంపేస్తామని దుండగులు హెచ్చరించారు. హైదరాబాదులోని బేగంపేటలో గల ఆర్ ఎస్ ఎస్ కార్యాలయాన్ని పేల్చేస్తామని కూడా వారు హెచ్చరించారు. గోశాలను తాము చెప్పిన వ్యక్తికి విక్రయించాలని కూడా వారు హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X