హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో నాపై అభిమానం చెక్కు చెదరలేదు: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తెలంగాణ ప్రజల్లో తనపై ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. ప్రజలు ఆహారం, ఉపాధి కోరుతున్నారు తప్ప విడిపోతే బాగుపడతామని అనుకోవడం లేదని ఆయన అన్నారు. సాక్షి టీవీ చానెల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. తెలంగాణ విషయంలో తన మాటలు నిజమనేది వాతావరణం చల్లబడిన తర్వాత తేలుతుందని ఆయన అన్నారు. తెలంగాణతో పాటు తాను అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తానని ఆయన చెప్పారు. తాను ఒక ప్రాంతానికి చెందినవాడిని కానని ఆయన అన్నారు.

యుపిఎకు తాను దగ్గరవుతున్నానని అనుకుంటే తాను ఏమీ చెప్పలేనని ఆయన అన్నారు. దగ్గర కావడమనేది కాకుండా ప్రజా సమస్యల దృష్ట్యా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒకరిపై వేలెత్తి చూపే ముందు తన గురించి కూడా ఆలోచించాలని ఆయన అన్నారు. తనపై ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోలేక పోయామని ఆయన అన్నారు. తన అంతిమ లక్ష్యం అధికారంకాదని, ప్రజా సమస్యల పరిష్కారమే తన అంతి లక్ష్యమని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X