వైయస్ జగన్ మొండితనంతో సమస్య: సోనియాకు డిఎస్ ఫిర్యాదు

జగన్ యాత్ర స్వభావ స్వరూపాలను, దానివల్ల పార్టీ కేడర్లో తలెత్తే గందరగోళాన్ని అధిష్ఠానం ముందు ఉంచుతూ, ఇది పార్టీకీ, ప్రభుత్వానికీ పెద్ద సవాలుగా మారనుందని డీఎస్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. యాత్రకు పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఎవరమూ వ్యతిరేకం కాదని, ఆయన మొండి పట్టుదలే పార్టీకి, ప్రభుత్వానికీ సమస్యగా తయారైందని చెప్పినట్లు సమాచారం. తన యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని, అది అడ్డుకోజూస్తోందనే వాదనకు బలం చేకూర్చుకోవడానికి జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని డీఎస్ అధిష్ఠానానికి నివేదించారు. యాత్ర వల్ల పార్టీలో గందరగోళం నెలకొనడమే కాకుండా రాష్ట్ర కేబినెట్ యాత్ర అనుకూల, వ్యతిరేక, తటస్థ వర్గాలుగా చీలిపోయిందని సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications