ఎంసెట్ ఫలితాలు:ఇంజనీరింగ్ బాలురు, మెడిసిన్ లో బాలికలు
విజయవాడకు చెందిన బోయపాటి పల్లవి(159) ఇంజనీరింగ్ విభాగంలో ప్రధమ స్థానం సాధించగా, విశాఖకు చెందిన మహ్మద్ గౌస్, గుంటూరుకు చెందిన జనార్థన్ రెడ్డి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. మెడిసిన్ విభాగంలో హైదరాబాద్కు చెందిన ఎన్.రాహుల్(156) మొదటి ర్యాంకు సాధించగా, రావినూతల లలిత, నారపనేని కిరణ్మయిలు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. 88.75 శాతం మంది ఇంజనీరింగ్ లో అర్హత సాధించగా, మెడిసిన్ లో 93.7శాతంమంది అర్హత సాధించారు. నెల 26 మార్కుల రీ-వాల్యూషన్, రీ-వెరిఫికేషన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ. జూలై మూడోవారం నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
Comments
హైదరాబాద్ ఎంసెట్ ఫలితాలు మెడిసిన్ ఇంజనీరింగ్ మోపిదేవి వెంకట రమణ hyderabad eamcet results medicine engineering mopidevi venkataramana
Story first published: Wednesday, June 16, 2010, 9:42 [IST]