ఎవరు ఫోన్ చేసినా ఆగేది లేదు: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

అయితే మొయిలీ ఫోన్ వచ్చిన తర్వాత కాంగ్రెసు సీనియర్ నాయకులు కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఎవరు ఫోన్ చేసినా ఆగేది లేదని ప్రకటించిన తర్వాత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులతో కలిసి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అయితే, గవర్నర్ తో భేటీకి కొంత మంది సీనియర్లు డుమ్మా కొట్టారు. అంతేకాకుండా, గవర్నర్ కు జలయజ్ఞంపై ఫిర్యాదు చేయకుండా, పోలవరం డిజైనింగ్ మార్చాలని మాత్రమే వారు గవర్నర్ ను కోరారు. తాము ప్రభుత్వంపై గానీ, ఇతరులపై గానీ ఫిర్యాదు చేయలేదని పాల్వాయి చెప్పారు.












Click it and Unblock the Notifications