హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రగులుతున్న పోలవరం వివాదం: వీరప్ప మొయిలీ జోక్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు వివాదం కాంగ్రెసు పార్టీలో మంటలు రేపుతోంది. ఈ స్థితిలో పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇఁచార్జీ వీరప్ప మొయిలీ జోక్యం చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై కాంగ్రెసు సీనియర్లు ఆరోపణలు చేయడం, తమ ఆరోపణలకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించడం వల్ల ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై ఎదురుదాడికి అస్త్రాన్ని అందించినట్లయింది. దీంతో అధిష్టానం జోక్యం చేసుకోక తప్పలేదని భావిస్తున్నారు. మొయిలీ బుధవారం ఉదయం పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డికి ఫోన్ చెసినట్లు చెబుతున్నారు.

పోలవరం వివాదానికి స్వస్తి చెప్పాలని ఆయన గోవర్దన్ రెడ్డి సూచించారు. బహిరంగ విమర్శలు చేయడం వల్ల పార్టీకి నష్టం చేస్తుందని ఆయన అన్నారు. పోలవరంపై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఆయన సూచించారు. అయితే తాము గవర్నర్ ను మర్యాదపూర్వకంగానే కలుస్తున్నామని, పోలవరంపై ఫిర్యాదు చేయడానికి కాదని పాల్వాయి మొయిలీతో చెప్పారు. కాగా, బయటా, లోపలా తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X