హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కదిరి ఏడు కోట్లు చంద్రబాబువే: ఆనం రామనారాయణ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anam Ramanarayana Reddy
హైదరాబాద్: అనంతపురం జిల్లా కదిరిలో వాహనాల్లో దొరికిన ఏడు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడివేనని మున్సిపల్ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో ఎక్కడ డబ్బులు దొరికినా అవి చంద్రబాబువేనని ఆయన అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో భేటీ తర్వాత ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ నేతల ప్రత్యేక రాష్ట్ర కోరికను తాము మన్నిస్తామని ఆయన చెప్పారు.

పోలవరం, జలయజ్ఞంపై తమ పార్టీ సీనియర్ నేతల వ్యాఖ్యలు సరి కావని ఆయన అన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై బురద చల్లే వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన సూచించారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని అగౌరవరపరచడం సరి కాదని ఆయన అన్నారు. డిఎస్ నేతృత్వంలోనే శ్రీకృష్ణ కమిటీకి తమ వాదనలు వినిపిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X