వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు పాపాలు పెరుగుతున్నాయి: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu
హైదరాబాద్‌: రాష్ట్రంలో ఓ వైపు గాలి గోపురాలు కూలుతున్నాయని, మరో వైపు కాంగ్రెసు పాపాలు పెరిగి పోతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన శనివారం అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది ప్రజా వ్యతిరేక విధానాలేనని ఆయన అన్నారు. మద్యం తాగిస్తూ పేదల రక్తాన్ని రోశయ్య ప్రభుత్వం తాగుతోందని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు కోత పెడుతోందని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను 13 సార్లు పెంచిందని ఆయన అన్నారు. రైతులు పంటలు పండించుకోలేని స్థితిలో పడ్డారని ఆయన అన్నారు. వారెన్ అండర్సన్ వ్యవహారంలో కాంగ్రెసు పార్టీ జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X