రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు సహా 17 మంది మృతి

Warangal Road Accident
వరంగల్: వరంగల్ జిల్లా నర్సింహులు పేట మండలం బీరిశెట్టిగూడెం వద్ద పెళ్లి బృందం వెళుతున్న రెండు ట్రాక్టర్లను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలించిన అనంతరం చికిత్స పొందుతూ పెళ్లి కుమారుడు నగేష్, నలుగురు మృతి చెందారు. దీనితో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. మరో 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో విషయం తెలుసుకుని సహాయక చర్యలు అందించడం ఆలస్యం కావడంతో మృతుల సంఖ్య పెరిగిందని భావిస్తున్నారు. బాధితులంతా మహబూబాబాద్ మండలం శనగపురం తండా వాసులుగా గుర్తించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పెళ్లికుమార్తె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మృతుల్లో ఆరుగురు బ్యాండ్ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రమాద స్థలంలో వాతావరణం చాలా భయానకంగా ఉంది. క్షతగాత్రులు ఎక్కువగా ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మృతదేహాలను 108 సిబ్బంది వెలికితీసి వరంగల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. ఎస్పీ సంఘటనా స్థలానికి చేరకుని ప్రమాదానికి గల కారణాలను, వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+