వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను రాజకీయాల కోసం రాలేదు: చంద్రబాబు నాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయనగరం: తాను రాజకీయాల కోసం రాలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆయన అన్నారు. మద్యం వ్యతిరేక పోరాటంలో భాగంగా విజయనగరం జిల్లా శృంగరవరంకోటలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించి ప్రజల రక్తం తాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా, రైతులకు విత్తనాలు అందకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. బెల్టు షాపులను కూలగొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇబ్బడి ముబ్బడిగా బెల్టు షాపులను ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే పనికి ప్రభుత్వం పూనుకుందని ఆయన అన్నారు.

మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతులిస్తూ వాటిని ఏటీఎం కేంద్రాలుగా మార్చేశారని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అవసరమైతే మద్యాన్ని డోర్‌ డెలివరీ చేసేందుకు కూడా రాష్ట్ర మంత్రులు సిద్ధమవుతారని ధ్వజమెత్తారు. పేద ప్రజలు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సంపాదించినదంతా మద్యానికే పోయాల్సి వస్తోందని విమర్శించారు. అంతకుముందు స్థానిక విద్యార్థులతో భేటీ అయిన చంద్రబాబు తమ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ ద్వారా లక్షా డెబ్భైవేల మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ప్రస్తుత సర్కారు వారికి ఉపకార వేతనాలు కూడా ఇవ్వలేకపోతోందని విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X