హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజామాబాద్ లో డిఎస్ కు తెలుగుదేశం చెక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్‌: నిజామాబాద్ అర్బన్ శాసనసభా స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది. వచ్చే నెల 27వ తేదీన తెలంగాణలోని పది శాసనసభా స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి డిఎస్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుంచి డి. శ్రీనివాస్ ఓడిపోయారు. ఆ స్థానం నుంచి గెలిచిన బిజెపి నాయకుడు లక్ష్మినారాయణ తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులతో పాటు రాజీనామా చేశారు. దీంతో తిరిగి ఆ స్థానానికి ఎన్నిక జరుగుతోంది.

నిజామాబాద్ నియోజకవర్గంలో డిఎస్ పై లక్ష్మినారాయణనే తిరిగి పోటీ చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా మైనారిటీ అభ్యర్థి అలీమ్ ను పోటీకి దించుతోంది. గత ఎన్నికల్లో మైనారిటీలను ఆకట్టుకోవడానికి డిఎస్ చేసిన ఓ వ్యాఖ్యతో హిందువులు ఆగ్రహం చెంది బిజెపి అభ్యర్థి లక్ష్మినారాయణను గెలిపించారనే అభిప్రాయం ఉంది. మైనారిటీ ఓట్లకు గండిపెడితే డిఎస్ విజయాన్ని అడ్డుకోవచ్చుననే అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావించి అలీమ్ ను పోటీకి దించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. లక్ష్మినారాయణకు తెరాస కూడా మద్దతిస్తోంది. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం కూడా డిఎస్ కు సహకరించే అవకాశం లేదు. పైగా, డిఎస్ కు వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో డిఎస్ కు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో విజయం సాధించడం సులభమేమీ కాదంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X