హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'దమ్ముంటే బాబు, జగన్, రోశయ్య పోటీ చేయాలి'

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: తెలంగాణ ఉప ఎన్నికల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో దమ్ముంటే కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కె. రోశయ్య పోటీ చేయాలని తెలంగాణ అమర వీరుల కుటుంబాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. వారు ముగ్గురు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే తమ సత్తా ఏమిటో చూపుతామని వారన్నారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలు బుధవారంనాడు హైదరాబాదులో సమావేశమై ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రజల సానుభూతి పొందడానికి కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అమర వీరుల కుటుంబాల సభ్యులను పోటీకి దించాలని అంటున్నాయని వారు విమర్శించారు.

ముఖ్యమంత్రి రోశయ్య వెనక ఇంకా ఎంత కాలం నడుస్తారని వారు కాంగ్రెసు తెలంగాణ నాయకులను ప్రశ్నించారు. పోటీ చేయడానికి తమకు టికెట్లు ఇవ్వడం కాదని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే అమర వీరులకు నిజమైన నివాళి అని వారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ ప్రకటిస్తే కాంగ్రెసు అభ్యర్థులను గెలిపిస్తామని వారు చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుంచి తాము యాత్ర చేపట్టనున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ కోసం రాజీనామా చేసినవారిని ఉప ఎన్నికల్లో గెలిపించడానికి ఈ యాత్ర చేపడుతున్నట్లు వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X