తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల, కాణిపాకం

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: శ్రీవారి దర్శనార్ధం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 32 కంపార్ట్‌ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కిలోమీటర్‌ మేర రోడ్డుపై భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటలు, శ్రీఘ్ర దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

ఇలా ఉండగా కాణిపాకంలో కూడా గురువారం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో గురువారం వేకువజామున పెళ్లి ముహుర్తాలు ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని 10, 51, 100 రూపాయల క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయం వెలుపల వరకు భక్తులు క్యూకట్టారు. వీరికి శీఘ్ర దర్శనం కల్పించడం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మహాలఘుదర్శనాన్ని ఏర్పాటు చేశారు. రద్దీతో భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X