హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణయ్యకు బండారు పరామర్శ, రోశయ్యపై విమర్శ

By Santaram
|
Google Oneindia TeluguNews

R Krishnaiah
హైదరాబాద్‌: బీసీలపై ముఖ్యమంత్రి రోశయ్య పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బిజెపి సీనియర్ నాయకుడూ బండారు దత్తాత్రేయ విమర్శించారు. బీసీ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించే విషయంలో ముఖ్యమంత్రి చొరవ చూపి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్యను దత్తాత్రేయ పరామర్శించారు. బీసీల పట్ల ముఖ్యమంత్రి పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

బోధనా ఫీజుల చెల్లింపు విషయంలో భాజపా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి సమస్య తీవ్రతను వివరిస్తామని వెల్లడించారు. గాంధీ ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్న విద్యార్థులు, వివిధ సంఘాల నేతులు ఆస్పత్రి గేటు ఎదుట బైఠాయించి బోధనా ఫీజులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X