విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగ వైష్ణవి హత్యలో ఎమ్మెల్యే జోగి హస్తం: మోర్ల శ్రీనివాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Naga Vaishnavi
విజయవాడ: విజయవాడలోని చిన్నారి, బిసి నేత పభాకర్ కూతురు నాగవైష్ణవి హత్యకేసులో కొత్త వివాదం చోటు చేసుకుంది. అసలు నిందితులు వేరే ఉన్నారంటూ ఈరోజు కోర్టుకు హాజరయిన నిందితుల్లో ఒకడైన మెర్ల శ్రీనివాసరావు నినాదాలు చేశాడు. ఎమ్మెల్యే జోగిరమేష్‌, ఆయన బావ స్వామి, నర్మదా దేవి అసలు నిందితులంటూ నినాదాలు చేశాడు. ప్రభాకర్‌ది సహజ మరణం కాదనీ హత్యే అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారంలో ఓ పోలీసు అధికారి పాత్ర కూడా ఉందని ఆతను ఆరోపించాడు. ఈ సమయంలో పోలీసులు మోర్ల శ్రీనివాస్ నోరు నొక్కి లోనికి లాక్కుని వెళ్లారు.

విచారణలో భాగంగా నిందితులు మోర్ల శ్రీనివాస్, జగదీష్, వెంకట్రావులను పోలీసులు సోమవారం విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టుకు హాజరుపరిచారు. వెంకట్రావు గౌడ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొద్దిరోజుల క్రితం హైకోర్టు కొట్టివేసింది. కేసు విచారణ వచ్చేనెల 21కి వాయిదా పడింది. తాను ఆరోపణలు చేస్తూ ఓ లేఖను మోర్ల శ్రీనివాస్ న్యాయమూర్తికి అందజేశాడు. నాగవైష్ణవి హత్యలో తనను పావుగా వాడుకున్నారని, తనకు హత్యతో సంబంధం లేదని అతను అన్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X