వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ లోని గిరిజన ఏరియాలోనే లాడెన్ దాక్కున్నాడు: సిఐఎ

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
వాషింగ్టన్: ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోని గిరిజన ప్రాంతంలో దాక్కున్నాడని సిఐఎ చీఫ్ అన్నారు. అల్ ఖైదా పూర్తిగా బలహీనపడిందని, అఫ్గానిస్తాన్ లో 60 నుంచి 100 మంది దాకా మాత్రమే ఆల్ ఖైదా కార్యకర్తలున్నారని సిఐఎ డైరెక్టర్ లియోన్ పానెట్టా అన్నారు. పాకిస్తాన్ గిరిజన ప్రాంతం ఆల్ ఖైదా ప్రధాన క్షేత్రమని భావించడానికి వీలు లేదని అన్నారు.

లాడెన్ పాకిస్తాన్ లోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నాడని చెప్పిన పెనెట్టా వివరాలు అందించలేదు. అది ప్రపంచంలోనే అతి కష్టమైన ప్రాంతమని పెనెట్టా అన్నారు. లాడెన్ చుట్టూ భద్రత కూడా ఉండి ఉంటుందని అన్నారు. తాము ఆల్ ఖైదా నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయడంలో మునిగిపోయామని అన్నారు. సగం ఆల్ ఖైదా నాయకుల పని పట్టగలిగామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X