వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడిలో రాజకీయాలు మాట్లాడను: గవర్నర్ నరసింహన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Narasimhan
విశాఖపట్నం: గుడిలో తాను రాజకీయాలు మాట్లాడబోనని గవర్నర్ నరసింహన్ అన్నారు. యుద్ధ నౌకల ప్రారంభోత్సవానికి సోమవారం విశాఖపట్నం చేరుకున్న నరసింహన్ మంగళవారం తెల్లవారుజామున సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయాధికారులు సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రాష్ట్రమనే పెద్ద కుటుంబాన్ని సుఖసంతోషాలతో ఉంచాలని తాను భగవంతుడ్ని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అందరూ కలిసి మెలిసి సౌఖ్యంగా ఉండాలని ఆయన ఆశించారు. నేవల్‌ డాక్‌ యార్డులో ఐఎన్‌ఎస్‌ కొండూల్‌, ఐఎన్ ‌ఎస్‌ కంకారియో యుద్ధ నౌకలను గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ యుద్ధ నౌకలు గోవా కేంద్రంగా పశ్చిమ తీరంలో సేవలను అందించనున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X