వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీనియర్ల ఆశలపై నీళ్లు: పోలవరం డిజైన్ మారదన్న బన్సాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Pawan Kumar Bansal
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు డిజెన్ విషయంలో కాంగ్రెసు తెలంగాణ నాయకులపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి బన్సాల్ నీళ్లు చల్లారు. పోలవరం డిజైన్ మార్చాలనే వారి డిమాండ్ ను ఆయన తిరస్కరిస్తూ, గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం డిజైన్ లో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీతో పాటు 12 ప్రాజెక్టులను ఆపించాలని కోరడానికి తెలుగుదేశం నాయకులు మంగళవారం బన్సాల్ ను కలిశారు. ఈ సందర్భంగా బన్సాల్ ఆ విషయం చెప్పారు. ఆర్థిక అంచనాలు, వ్యయం పెరగడం వల్లనే పోలవరం అనుమతి ఆగిపోయిందని, ఆర్థిక శాఖ అనుమతి విషయమై పరిశీలన జరుపుతోందని ఆయన అన్నారు.

బాబ్లీ సమస్య పరిష్కారం కోసం త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి చర్చలకు ఆహ్వానిస్తామని ఆయన తెలుగుదేశం నాయకులకు హామీ ఇచ్చారు. అదనపు జలాల వినియోగం, అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారం విషయాల్లో తమ పాత్ర పరిమితమని, ఏ రాష్ట్రానికి కూడా కేంద్రం మద్దతివ్వలేదని ఆయన అన్నారు. ఇలాంటి సమస్యలపై ట్రిబ్యునల్ కు వెళ్లాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X